Saturday, October 10, 2020

Green signal for teachers transfers



Read also:

  • ఉపాధ్యాయులకు శుభవార్త
  • రెండు- మూడు రోజుల్లో ఉత్తర్వులు
  • ఎనిమిదేళ్లున్న ఉపాధ్యాయులకు,ఐదేళ్లున్న హెచ్‌ఎంలకు తప్పనిసరి
  • రెండేళ్లు పూర్తి చేసుకున్నా అర్హులే
  • ఫిబ్రవరి 29 కటాఫ్‌.పెర్ఫార్మెన్స్‌ పాయింట్ల స్థానంలో సర్వీసు
  • సీఎం సంతకం, త్వరలో ఉత్తర్వులు
  • ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు, కౌన్సెలింగ్

ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రాతినిధ్యంతో ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం  తెలుపుతూ సంబంధిత ఫైలు పై  ఈ రోజు ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడుతాయి.

29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీలు కార్యక్రమం చేపడతారు. మూడు సంవత్సరాలుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న  ఉపాధ్యాయులకు బదిలీల అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు.


Green_signal_for_teachers_transfers

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం తెలిపారు. ఈమేరకు సంబంధిత ఫైలుపై శనివారం ఆయన సంతకం చేశారు. రెండు మూడు రోజుల్లో బదిలీల అంశంపై ఉత్తర్వులు వెలువడనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 29-2-2020 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ బదిలీలకు అర్హులు అని తెలిసింది.

కొవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. బదిలీలకు సంబంధించి గతంలో ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ అధికారులు నిర్వహించిన సమావేశాల్లో చర్చించిన అంశాలు, వ్యక్తమైన సూచనలు, సలహాల మేరకు విధివిధానాలపై కొంత మేరకు స్పష్టత వచ్చింది. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేసిన ఉపాధ్యాయులు అందరూ బదిలీకి అర్హులవుతారు. అయితే, ఒకే చోట ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, ఐదేళ్లు పూర్తయిన హెడ్మాస్టర్లు తప్పనిసరిగా బదిలీ అవుతారు. ఈసారి బదిలీల్లో పెర్ఫార్మెన్స్‌ పాయింట్లకు బదులు సర్వీస్‌ పాయింట్లను(ఏడాదికి 0.5) ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.

40% వైకల్యం ఉంటే దివ్యాంగుల కింద పరిగణించి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 29 ప్రకారమే ఈసారి రేషనలైజేషన్‌ ప్రక్రియ అమలు చేయనున్నారు. అయితే, గత ప్రభుత్వం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు కేటాయించిన పోస్టులను రద్దు చేస్తున్నారు. టీచర్లు, విద్యార్థుల 1:30 నిష్పత్తిలో పోస్టులను కేటాయించారు. గతంలో 80 మంది విద్యార్థులకు 4 పోస్టులు, 100 మంది విద్యార్థులకు 5 పోస్టులు, 120 మంది విద్యార్థులకు 6 పోస్టులు ఇచ్చారు. అప్పుడు నిష్పత్తి 23గా ఉండగా ప్రస్తుతం దాన్ని 1:30గా నిర్ణయించారు. మొత్తం మీద కొన్ని మార్పులతో మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో దాదాపు 1.90 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా. సుమారు లక్ష మంది బదిలీల కోసం ఎదురు చూస్తున్నారు

బదిలీల హై లైట్స్

  • రేషన్ లైజేషన్ కు కటాఫ్ 29.2.2020, స్టాఫ్ పాటర్న్ లో ఏ‌మార్పు లేదు. 
  • 60 రోలు వరకు 2 ఎస్.జీ.టీ పోస్టులు
  • బదిలీలకు 1.9.2020 కటాఫ్.
  • కనీసం రెండు సంవత్సరాల సర్వీస్, 5/8 అకడమిక్ సంవత్సరాలు పూర్తి అయిన వారు తప్పని సరి బదిలీ
  • వెబ్ కౌన్సెలింగ్
  • సర్వీస్, స్టేషన్ పాయింట్స్ మాత్రమే. వేరే ఏ విధమైన స్పెషల్ పాయింట్స్ ఉండవు.
  • వ్యాధి గ్రస్తులు, వికలాంగులకు ప్రిఫరెన్స్
  • రెండేళ్ళలో రిటైర్ అయ్యే వారికి బదిలీ ఉండదు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :