Read also:
ఇటివల కేంద్ర ప్రభుత్వం ఆన్లాక్ 5 మార్గదర్శకాలను ప్రకటించడంతో.కరోనా నుంచి ప్రజల జీవన విధానం సాధారణ స్థితికి వచ్చింది. దాదాపు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యతావిధిగా సాగుతున్నాయి.అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధిదంచిన అన్లాక్ 5.0 గైడ్లైన్స్ను విడుదల చేసింది.
New Guidelines
- రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి* సినిమాహాళ్లు,
- షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలి మాస్క్ లేకపోతే నో ఎంట్రీ
- ప్రజారవాణాలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
- ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలి
- కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
- బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మాస్క్ లు ధరించేలా ప్రచారం , మైక్ అనౌన్స్ మెంట్
- సినిమా హాల్స్ లో కోవిడ్ నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శనలు
- స్కూళ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరి
- విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజేషన్ చేసుకునేలా యాజమాన్యాలు ఏర్పాటు చేయాలి