Read also:
Visakhs-Tirupati Trains:మళ్లీ పట్టాలెక్కుతున్న విశాఖ టు తిరుపతి డబుల్ డెక్కర్
- విశాఖ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. తిరుపతి-విశాఖపట్నం-తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ తిరిగి పట్టాలెక్కనుంది. బుధవారం రైల్వే శాఖ ఓ ప్రకటన చేసింది.
- సాధ్యమైనంత త్వరగా ఈ రైలు సర్వీసుని పునరుద్ధరించనున్నట్లు తెలిపింది. గతంలో వారంలో మూడు రోజుల పాటు న్యూగుంటూరు, తెనాలి రైల్వేస్టేషన్ల మీదుగా ఈ రైలు రాకపోకలు కొనసాగించింది.
- కరోనా, లాక్డౌన్ తర్వాత రైలు రాకపోకలు నిలిచిపోయాయి. అన్లాక్తో పాటూ కరోనా తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ ట్రైయిన్ సర్వీసును ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
- 22707 నెంబర్ విశాఖపట్నం-తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ప్రతీ సోమ, గురు, శనివారంలలో రాత్రి 10.25 గంటలకు బయలుదేరి మరుసటిరోజు వేకువజామున 4.53కి న్యూగుంటూరు, 5.42కి తెనాలి వచ్చి ఉదయం 11.35 గంటలకల్లా తిరుపతికి చేరుకుంటుంది.
- ఇక 22708 నెంబర్ తిరుపతి-విశాఖపట్నం డబుల్ డెక్కర్ రైలు ఆది, బుధ, శుక్రవారంలలో రాత్రి 9.50గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 2.53కి తెనాలి, 3.38కి న్యూగుంటూరుకు వచ్చి ఉదయం 11గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లలో ఏసీ సిట్టింగ్ సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంటుంది.