Read also:
పెండింగ్ బిల్లులకు పైసా లేదు
అధికారికంగా సీఎస్ఎంఎస్లో ప్రస్తుతం రూ.35 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి సీఎఫ్ఎంఎస్ బయట దాదాపు రూ.70 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నారు. ఇందులో దేనికీ ఓటాన్ అకౌంట్లో నిధులు కేటాయించలేదు ఇప్పుడు పెండింగ్ లో ఉన్న బిల్లులకు సంబంధించి బిల్లు స్టేటస్ చూస్తే.ఖజానాలో సరిపడా నిధుల్లేక చెల్లించలేకపోతున్నామనే సందేశం ఆ బిల్లులు అందాల్సిన వారికి వస్తోంది. ఏప్రిల్ 1 నుంచి అసలు మీ బిల్లులకు బడ్జెటే లేదనే సందేశం రానుంది. దీంతో పెండింగ్ బిల్లులున్న వారు లబో దిబోమంటున్నారు. బడ్జెట్ కేటాయింపులు ఉంటేనే తమకు బిల్లులు చెల్లించడం లేదని.ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ కూడా ఉండదని.ఇక తమనెవరు ఆదుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.