CBSE board exams 2021-సీబీఎస్ఈ పరీక్ష తేదీలను ప్రకటించిన కేంద్ర మంత్రి పూర్తి వివరాలివే
సీబీఎస్ఈ పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ నిశాంక్ ఈ రోజు ప్రకటించారు. మే 4 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ రోజు ప్రకటించారు. మే 4 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. జూన్ 10న పరీక్షలు ముగుస్తాయన్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన ఈ రోజు మాట్లాడారు. కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. జూలై 15న ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు మే 1న ప్రారంభం అవుతాయని వివరించారు. కేంద్ర మంత్రి ప్రకటనతో పరీక్షలపై విద్యార్థుల సందేహాలు, అనుమానాలు తీరాయి. అయితే పరీక్షలకు మరో నాలుగు నెలలు మాత్రమే సమయం మిగిలింది. దీంతో ప్రిపరేషన్ కు సమయం సరిపోతుందా? లేదా? అన్న అంశం ప్రశ్నార్థకంగా మారింది.