Read also:
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. ఈ మేరకు గవర్నర్ పేరిట నోటిఫికేషన్ విడుదలయింది.
ఏపీలో శాసనసభ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. ఈనెల 30 నుంచి నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు.
నవంబరు 30న (సోమవారం) ఉదయం 9 గంటల నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు.
ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఐతే డిసెంబరు 4 వరకు సమావేశాలు జరగనున్నట్లు సమాచారం.
కాగా, స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం, సీఈసీ మధ్య మాటలయుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.ఏపీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్గా జరిగే అవకాశముంది.