Read also:
Schools must complete Nadu-Nedu work by November 15
పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనులను నవంబరు 15లోపు పూర్తి చేయాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశించారు. పాఠశాలల మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను మాత్రం పాఠశాలలు తెరిచేలోపు పూర్తి చేయాలన్నారు. జలజీవన్ మిషన్ కింద ప్రతి పాఠశాలకూ తాగునీటి పైపులైన్లు వేయాలని సూచించారు.
9, 10 తరగతుల విద్యార్థులకు డ్యుయల్ డెస్క్ల పరిమాణం పెద్దగా ఉండాలని, వారంలోపు నమూనాలు ఖరారు చేసి, ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ సచివాలయాల వ్యవస్థ, విద్యా సంస్కరణలను కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోక్రియల్ అభినందించారని మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటనలో తెలిపారు.‘గోరుముద్ద’ పథకం కింద విద్యార్థులకు మంచి పౌష్ఠికాహారం అందిస్తున్నందుకు అభినందించినట్లు చెప్పారు.