Read also:
Actor Venugopal Kosuri passes away due to carona
కరోనా చాలా మందిని పొట్టన పెట్టుకుంటుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో కూడా పలువురు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో ప్రముఖ నటుడు కూడా కరోనాతో చనిపోయాడు.
కరోనా చాలా మందిని పొట్టన పెట్టుకుంటుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో కూడా పలువురు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో ప్రముఖ నటుడు కూడా కరోనాతో చనిపోయాడు. ఇప్పటికే టాలీవుడ్లో నిర్మాత పోకూరి రామారావుతో సహా మరో నిర్మాత కూడా కన్నుమూసాడు. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు కూడా కరోనాతో ప్రాణాలు వదిలాడు. ఆయన పేరు కోసూరి వేణుగోపాల్. పేరు పెద్దగా పరిచయం లేకపోయినా కూడా ఫేస్ చూస్తే ఈయనా అంటారు. రాజమౌళి సినిమాల్లో ఈయన ఎక్కువగా కనిపిస్తుంటాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్నాడు వేణుగోపాల్. కరోనాతో ఈయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 23న ఈయన కన్నుమూశారు.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఈయన స్వగ్రామం. ఎఫ్సీఐలో మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. ఆ తర్వాత రాజమౌళి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మర్యాద రామన్న సినిమాలో బ్రహ్మాజీ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించాడు ఈయన. దాంతో పాటు విక్రమార్కుడు, ఛలో లాంటి సినిమాల్లో కూడా నటించాడు వేణుగోపాల్. తెలుగులో దాదాపు 30 సినిమాలకు పైగానే నటించాడు ఈయన. వేణుగోపాల్ మరణంతో తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.