Read also:
సంక్షేమ పథకాల అమలుతో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టిన ఆయన సంక్రాంతి తర్వాత మరో పథకం అమలుకు రెడీ అయ్యారు. మధ్యాహ్న భోజనం మరింత రుచికరంగా, ఎక్కువ పదార్ధాలతో ఉండేలా మెనూ రూపొందించారు. ఈ పథకాన్ని సంక్రాంతి తర్వాత జనవరి 21 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. దీనికోసం ఏపీ ప్రభుత్వం అదనంగా రూ.353 కోట్లు కేటాయించింది. మెనూ ప్రకారంలో వారంలో ఐదు రోజుల పాటు గుడ్డు అందించనున్నారు. మెనూ ఎలా ఉందంటే.
New Menu
సోమవారం : అన్నం, పప్పు చారు, ఎగ్ కర్రీ, చిక్కిమంగళవారం : పులిహోర, టమాట పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం : కూరగాయలతో అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి
గురువారం : కిచిడీ, టమాట చట్నీ, ఉడికించిన గుడ్డు
శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి
శనివారం : అన్నం, సాంబారు, స్వీట్ పొంగలి.