Sunday, December 15, 2019

good news for who are getting sukanya samruddi yojana account



Read also:

సుకన్య సమృద్ధి ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త

సుకన్య సమృద్ధి అకౌంట్ గురించి ప్రస్తుతం చాలా మందికి అవగాహన కలిగి ఉంటుంది. ఆడ పిల్లల ఆర్థిక భద్రతే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన పథకం ఇది. పది సంవత్సరాలలోపు వయసు ఉన్న ఆడ పిల్లల పేరుపై ఈ అకౌంట్‌ను తెరవొచ్చు. పోస్టాఫీస్, బ్యాంకులకు వెళ్లి ఈ సుకన్య సమృద్ధి ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు.
అయితే పోస్టాఫీస్‌ లో సుకన్య సమృద్ధి అకౌంట్‌ కలిగిన వారికి ఇప్పుడు తీపికబురు ఒకటి వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తాజాగా పోస్టాఫీస్ స్కీమ్స్‌ కు సంబంధించిన రూల్స్‌ ను కాస్త సవరించింది.
దీనితో సుకన్య సమృద్ధి అకౌంట్ ఉన్న వారికి ప్రయోజనం పొందుతారు. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఆర్‌ డీ అకౌంట్ ఉన్న వారికి కూడా లాభం ఇప్పుడు లభించనుంది.
కొత్త నిబంధన వల్ల ఇకపై నాన్ హోమ్ పోస్టాఫీస్‌ బ్రాంచ్‌ కు వెళ్లి చెక్‌ బుక్ ద్వారా చెల్లింపులు నిర్వహించవచ్చు. ఇప్పటిదాకా అయితే రూ.25,000కు పైన చెక్‌ లను ఇతర పోస్టాఫీస్ బ్రాంచ్‌ లకు వెళ్లి డిపాజిట్ చేయడానికి కస్టమర్లకు అవకాశం లేదు. దీనితో పోస్టాఫీస్‌లో సేవింగ్ స్కీమ్స్ కలిగిన వారికి కాస్త ప్రయోజనం లభించనుంది. సుకన్య సమృద్ధి అకౌంట్ సహా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), రికరింగ్ డిపాజిట్ అకౌంట్ వాటిల్లో ఇతర బ్రాంచులలోనూ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ చెక్‌ బుక్ ద్వారా డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందడం వల్ల ఇండియా పోస్ట్ ఈ మేరకు తన నిబంధనల్లో మార్పులు చేసింది.
సీబీఎస్ పోస్టాఫీస్‌ లు ఇష్యూ చేసిన అన్ని రకాల పీఓఎస్‌బీ చెక్స్ అన్నీ ఏ బ్రాంచుల్లో అయిన సరే ఇకపై తీసుకుంటారు. దీనితో పోస్టాఫీస్‌ లో సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారి అకౌంట్‌లో లేదా రికరింగ్ డిపాజిట్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి అకౌంట్లలో చెక్‌ ను డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే క్యాష్ విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తే అప్పుడు చెక్ పరిమితి రూ.25,000 వరకు మాత్రమే ఉంటుంది.
ఆడ పిల్లల ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన పథకం 'సుకన్య సమృద్ధి యోజన' ఇది. పదేళ్లలోపు వయసు ఉన్న ఆడ పిల్లల పేరుపై ఈ అకౌంట్‌ను తెరవొచ్చు. పోస్టాఫీస్ లేదా బ్యాంకులకు వెళ్లి ఈ సుకన్య సమృద్ధి ఖాతాను ఓపెన్ చేయవచ్చు. పోస్టాఫీస్‌లో సుకన్య సమృద్ధి అకౌంట్‌ కలిగిన వారికి ఇప్పుడు తీపికబురు అందింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ తాజాగా పోస్టాఫీస్ స్కీమ్స్‌కు సంబంధించిన రూల్స్‌ను సవరించింది. దీంతో సుకన్య సమృద్ధి అకౌంట్ ఉన్న వారికి ప్రయోజనం కలుగనుంది. అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఆర్‌డీ అకౌంట్ ఉన్న వారికి కూడా లాభం చేకూరుతుంది. కొత్త నిబంధన వల్ల ఇకపై నాన్ హోమ్ పోస్టాఫీస్‌ బ్రాంచ్‌కు వెళ్లి చెక్‌బుక్ ద్వారా చెల్లింపులు నిర్వహించొచ్చు.ఇప్పటిదాకా అయితే రూ.25,000కు పైన విలువైన చెక్‌లను ఇతర పోస్టాఫీస్ బ్రాంచ్‌లకు వెళ్లి డిపాజిట్ చేయడానికి కస్టమర్లకు అనుమతి లేదు. దీంతో పోస్టాఫీస్‌లో సేవింగ్ స్కీమ్స్ కలిగిన వారికి దీంతో ప్రయోజనం లభించనుంది. సుకన్య సమృద్ధి అకౌంట్ సహా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), రికరింగ్ డిపాజిట్ అకౌంట్ వాటిల్లో ఇతర బ్రాంచులోలనూ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ చెక్‌బుక్ ద్వారా డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందడం వల్ల ఇండియా పోస్ట్ ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేసింది.
సీబీఎస్ పోస్టాఫీస్‌లు ఇష్యూ చేసిన అన్ని రకాల పీఓఎస్‌బీ చెక్స్ అన్నీ ఏ బ్రాంచుల్లోనైనా ఇకపై తీసుకుంటారు. దీంతో పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారి వారి అకౌంట్‌లో లేదా రికరింగ్ డిపాజిట్, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి అకౌంట్లలో చెక్‌ను డిపాజిట్ చేసుకోవచ్చు. అయితే క్యాష్ విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తే అప్పుడు చెక్ పరిమితి రూ.25,000 వరకే ఉంటుంది. సుకన్య సమృద్ధి అకౌంట్‌ను ఒక ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లల పేరుపై ఓపెన్ చేయొచ్చు.
వీరికి పదేళ్లలోపు వయసు ఉండాలి. దత్తత తీసుకున్న ఆడ పిల్ల పేరుపై కూడా సుకన్య ఖాతా తెరవొచ్చు. ఒకవేళ కవలలు పుడితే అప్పుడు ఒక కుటుంబంలో గరిష్టంగా ముగ్గురి పేరుపై కూడా సుకన్య ఖాతా ప్రారంభించొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు అకౌంట్‌లో డిపాజిట్ చేయొచ్చు. కనీసం రూ.250 డిపాజిట్ చేసిన సరిపోతుంది.
రూ.250 కాకుండా నెలకు కనీసం రూ.1,000 కట్టుకుంటే మంచిది. నెలకు రూ.1,000 నుంచి రూ.12,000 మధ్యలో డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత రూ.6 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు పొందొచ్చు. ఖాతా తెరిచిన దగ్గరి నుంచి 15 ఏళ్లు వరకు అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో ఆన్‌లైన్‌లోనే చెక్ చేసుకోవచ్చు.
అన్ని బ్యాంకులు ఇలాంటి సేవలు అందించడం లేదు. కేవలం కొన్ని బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. బ్యాంక్ నుంచి ఎస్ఎస్‌వై అకౌంట్ లాగిన్ వివరాలు తీసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయంతో లాగిన్ అవ్వాలి.
తర్వాత హోమ్ పేజ్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఆడ పిల్లకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత 50 శాతం డబ్బుల్ని వెనక్కు తీసుకోవచ్చు. 21 ఏళ్లు వచ్చిన తర్వాత మొత్తం డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉన్నత చదువు, పెళ్లి వంటి వాటికి డబ్బుల్ని ఉపయోగించుకోవచ్చు. పాప బర్త్ సర్టిఫికెట్, ఫోటోలు, తల్లిదండ్రులు లేదా సంరక్షుల ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :