Saturday, December 14, 2019

LIC scholorship



Read also:

టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ.ఎవరికైనా ఎల్ఐసీ నుంచి స్కాలర్‌షిప్

  • పేద విద్యార్థులకు శుభవార్త. భారత ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక బీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC గురించి అందరికీ తెలిసిందే. 
  • లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ అయిన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-LIC HFL పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. 'ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ విద్యాదాన్ స్కాలర్‌షిప్' పేరుతో 8వ తరగతి నుంచి పీజీ చదివే విద్యార్థుల వరకు అందరికీ రూ.30,000 వరకు స్కాలర్‌షిప్స్‌ అందిస్తోంది.
  • దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2019 డిసెంబర్ 31 చివరి తేదీ.
  • 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు అంతకుముందు తరగతిలో 65% మార్కులతో పాస్ కావాలి. వార్షికంగా రూ.10,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, ఐటీఐ, డిప్లొమా, పాలిటెక్నిక్ విద్యార్థులు 10వ తరగతి 65% మార్కులతో పాస్ కావాలి. వార్షికంగా రూ.15,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
  • డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేషన్‌లో చేరిన విద్యార్థులు 12వ తరగతిలో 65% మార్కులతో పాస్ కావాలి.వార్షికంగా రూ.20,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
  • పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ ప్రోగ్రామ్‌లో చేరిన విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ 65% మార్కులతో పాస్ కావాలి.వార్షికంగా రూ.30,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
  • గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదువుతున్నవారు మాత్రమే స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయాలి. స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసే విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3,00,000 లోపు ఉండాలి.
  • ముందుగా ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలోనే విద్యాదాన్ స్కాలర్‌షిప్‌ పేజీ కనిపిస్తుంది క్లిక్ చేయాలి. 
  • Buddy4Study పేరుతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. లేదా
  • అందులో ఆయా తరగతులకు వేర్వేరుగా దరఖాస్తు లింక్స్ కనిపిస్తాయి.
  • మీరు చదువుతున్న తరగతిని బట్టి దరఖాస్తు లింక్ క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేసి స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయాలి.
  • ఫోటో ఐడీప్రూఫ్, అడ్మిషన్ ప్రూఫ్, విద్యా సంవత్సరం ఫీజు వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆర్థిక అవసరాలు, మెరిట్‌ను బట్టి స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.
  • తల్లి లేదా తండ్రి లేనివారికి, అనాథలకు, తల్లిదండ్రుల పరిస్థితి బాగాలేనివారికి, ఉపాధిలేని కుటుంబాలకు చెందిన పిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది.
  • విద్యార్థులు టెలిఫోన్ ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత అవసరమైతే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ తర్వాత విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :