Read also:
వీవోఏల వేతనం పెంపుపై ఉత్తర్వులు
వెలుగు వీవోఏల గౌరవవేతనాన్ని రూ.10 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,297 మంది వెలుగు వీవోఏలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం నుంచి రూ.8 వేలు, గ్రామ సంఘాల నుంచి రూ.2 వేలు చెల్లించనున్నారు.వచ్చే నెల నుంచి ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వం అదేశించింది.