Friday, April 30, 2021

AP Inter Exams: ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం కీలక ప్రకటన-వారికి మరో అవకాశం



Read also:

AP Inter Exams: ఇంటర్ పరీక్షలపై ప్రభుత్వం కీలక ప్రకటన-వారికి మరో అవకాశం

  • ఇంటర్ పరీక్షలకు (Inter Exams) సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. (Andhra Pradesh Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది.
  • ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసి.. విద్యార్థులకు కేటాయించే పనిలో ఉంది.
  • కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం మాత్రం ముందుకెళ్తోంది.
  • ఇప్పటికే హాల్ టికెట్లను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచిన ప్రభుత్వం.. విద్యార్థులకు డౌన్ లోడ్ చేసుకునే అవకాశమిచ్చింది.
  • ఐతే కొవిడ్ సోకిన విద్యార్థులు నష్టపోకుండా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
  • పరీక్షల సమయంలో కొవిడ్ తో బాధపడుతున్న విద్యార్థులకు సప్లిమెంటరీ రాసే అవకాశం కల్పిస్తామని.పాసైనవారికి రెగ్యులర్ కింద సర్టిఫికెట్ జారీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
  • విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :