Read also:
Identity cards for Teacher MLC elections
వచ్చే నెల 14న రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు గుర్తింపు కార్డులను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. 14న తూర్పు పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి, కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో ఓటర్లు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, పాస్ పోర్ట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమల్లో ఉద్యోగులైతే ఆ సర్వీసు గుర్తింపు కార్డు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గుర్తింపు కార్డులు విద్యా సంస్థలు జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డులు, యూనివర్సిటీలు జారీ చేసిన డిగ్రీ డిప్లొమా సర్టిఫికెట్లు ఒరిజినల్స్, సంబంధిత అథారిటీ జారీ చేసిన ఒరిజినల్ అంగ వైకల్య సర్టిఫికెట్ లో ఏదైనా చూపి ఓటు వేయవచ్చునని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాల యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.