Read also:
ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష ఫీజు షెడ్యూల్ను ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి పొడిగించింది.
2020-21 విద్యా సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోపు కళాశాల ప్రిన్సిపాల్స్కు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.విద్యార్థుల ఫీజులను ప్రిన్సిపాల్స్ ఈ నెల 26వ తేదీలోపు బోర్డు ఖాతాకు ఆన్లైన్ ద్వారా బదిలీ చేయాలని సూచించారు. ఈ నెల 27వ తేదీలోపు ఆర్ఐఒ కార్యాలయంలో ప్రింటు తీయాలని వివరించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డు అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in ద్వారా చెల్లించొచ్చని వెల్లడించారు.