AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం-మరో కొత్త పథకానికి శ్రీకారం.. ఇకపై వారికీ రూ.15వేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపైనే ఏపీ కేబినెట్ ప్రధానంగా చర్చించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల కేలండర్ కు మంత్రివర్గం ఆమోదం తెలపడమే కాకుండా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎస్ఆర్ చేయూత, కాపునేస్తం, నేతన్న నేస్తం మాదిరిగా మరో కీలక పథకాన్ని రంగంలోకి దీంచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు మహిళలకు అందిస్తున్న పథకాన్ని ఈబీసీ మహిళలకూ వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఈబీసీ నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వచ్చే మూడోళ్లలో ఒక్కో మహిళా లబ్ధిదారుకు ఈసీబీ నేస్తం పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు చొప్పున రూ.45 వేల ఆర్ధిక సాయం అందించనుంది.
ముగిసిన AP కాబినెట్ మీటింగ్ కీలక నిర్ణయాలు ఇవే
వచ్చే బడ్జెట్లోనే ఈ పథకానికి సంబంధించిన కేటాయింపులను కూడా జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఇక కేబినెట్ సమావేశంలో మరికొన్ని కీలక అంశాలను ఆమోదించింది. అమరావతి రాజధానిలో అసంపూర్తిగా ఉన్న భవనాలపైనా చర్చ జరిగింది. రాజధాని పరిధిలోని భవనాలను పూర్తి చేసేందుకు అమరావతి రీజియన్ డెవలప్ మెంట్ అధారిటికీ రూ.3వేల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పదవతరగతి పరీక్ష 2021 కొరకు 7 పేపర్లు.. బ్లూ ప్రింట్ GO-8 మరియు GO-11 లను జిల్లా అధికారులకు communicate చేసిన పాఠశాల విద్యా శాఖ సంచాలకులు-Click Here
AP SSC పదవ తరగతి లో తగ్గించిన సిలబస్ (2021 పరీక్షలకు ) విడుదల చేసిన SCERT-Click Here
ఇక కాకినాడ సెజ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్టపరిహారం చెల్లించే అంశాన్ని ఆమోదించింది. నష్టపరిహారంపై కమిటీ సూచనల కంటే ఎక్కువే చెల్లించాలని నిర్ణయించింది. అలాగే సెజ్ పరిధిలోని ఆరు గ్రామాలను తరలించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అలాగే కడపలో నిర్మించనున్న వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థకు ఆమోదం తెలిపింది. దీంతో పాటే కడప జిల్లాలో రెండు ఇండస్ట్రియల్ పార్కులకు భూ కేటాయింపులపై చర్చించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం, టిడ్కో ఇళ్ల కేయాయింపు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, మున్సిపల్ ఎన్నికల వంటి కీలక అంశాలు కేబినెట్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది.