Read also:
ఉపాధ్యాయ బదిలీల జాబితాను ఈ నెల 9 తర్వాతనే ఆన్లైన్లో ఉంచే అవకాశం ఉంది. ప్రస్తుతం అమ్మఒడి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ బదిలీల జాబితాను విడుదల చేయనున్నారు. బదిలీ అయిన వారు సంక్రాంతికి ముందే కొత్త పాఠశాలల్లో చేరేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తప్పనిసరి బదిలీ కావాల్సిన ఉపాధ్యాయులు 26,117 మంది ఉండగా.అభ్యర్థన బదిలీలకు దరఖాస్తు చేసుకున్న వారు దాదాపు 50 వేల మంది ఉన్నారు. డిసెంబరు 31 అర్ధరాత్రితో బదిలీలకు ఐచ్ఛికాల నమోదు పూర్తయింది. దీంతో, అధికారులు వెబ్కౌన్సెలింగ్ వెబ్సైట్ను ఫ్రీజ్ చేశారు.