Read also:
ట్రిపుల్ఐటీ ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంగణాల్లో ఓపెన్ కేటగిరీ సీట్లు అందుబాటులో ఉన్నాయని, అన్ని కేటగిరీలకు చెందిన బీసీలు, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలోని ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీలు 4001-5000 ర్యాంకుల వరకు కౌన్సెలింగ్కు హాజరు కావొచ్చని కన్వీనర్ హరినారాయణ తెలిపారు. శనివారం ఉదయం 8గంటలకు నూజివీడు, ఇడుపులపాయ ప్రాంగణాల్లో కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్కు చెందిన 5001- 7000 ర్యాంకుల వారు మధ్యాహ్నం 12గంటలకు హాజరు కావాలని తెలిపారు.