Read also:
ITR Due Date Extension: ట్యాక్స్ పేయర్స్కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్న్స్ గడువును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ను 2021 జనవరి 10 వరకు చెల్లించవచ్చునని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పన్ను చెల్లింపుదారులకు ఇది మరింత సౌలభ్యాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు. అలాగే ఆడిటింగ్ నిర్వహించాల్సిన పన్ను చెల్లింపుదారులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు అవకాశం ఉందని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఐటీఆర్ గడువును జులై 31 నుంచి డిసెంబర్ చివరి వరకు కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే.