Wednesday, December 30, 2020

ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హతతో 800 ఉద్యోగాలు



Read also:

అనేక మంది నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా మరో ప్రకటన చేసింది. ప్రముఖ అమర్ రాజా గ్రూప్(Amar Raja Group) కంపెనీలో భారీగా ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది.

అనేక మంది నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా మరో ప్రకటన చేసింది. ప్రముఖ అమర్ రాజా గ్రూప్ కంపెనీలో భారీగా ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 800 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు చిత్తూరు జిల్లాలోని అమర్ రాజా గ్రూప్ లో పని చేయాల్సి ఉంటుంది. వారికి రూ.10,500 వరకు వేతనం చెల్లించనున్నారు. ఉద్యోగానికి ఎంపికైన వారికి ఫుడ్, ట్రాన్స్ పోర్ట్, వసతి సదుపాయాలను సబ్సిడీపై కల్పించనున్నారు.

విద్యార్హతలు, ఇతర వివరాలు

టెన్త్, ఇంటర్, ఐటీఐ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు దరఖాస్తుకు అర్హులు. అయితే కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. డిప్లొమో, డిగ్రీ, బీటెక్ మధ్యలో ఆపేసిన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18-30 ఏళ్ల మధ్యలో ఉండాలి.

అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 1లోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం జిల్లా స్కిల్ డవలప్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు అమర్ రాజా కంపెనీలో శిక్షణ ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగం కల్పించబడుతుంది. ఏమైనా సందేహాలుంటే 9676165850 నంబరును సంప్రదించాలని సూచించారు.

ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హతతో 800 ఉద్యోగాలు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :