Read also:
Cancel some fees for inter students in AP, government orders
ఏపీలో ఇంటర్ విద్యార్థులకు కొన్ని ఫీజులు రద్దు, ప్రభుత్వం ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్న నేపథ్యంలో వారికి ఊరట కల్పిస్తూ ఇంటర్ బోర్డు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
ఇంటర్ విద్యార్థులకు సంబంధించి వివిధ ఫీజులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది
రీ అడ్మిషన్స్ (రూ.1000), టీసీ అడ్మిషన్స్ (రూ.1000), సెకండ్ లాంగ్వేజ్ మార్చుకునే ఫీజు (రూ.800, ఫస్ట్ ఇయర్ మాత్రమే), మీడియం మార్చుకోవడానికి ఫీజు (రూ.600, ఫస్ట్ ఇయర్ మాత్రమే), గ్రూప్ మార్చుకోవడానికి ఫీజు (రూ.1000, ఫస్ట్ ఇయర్ మాత్రమే), ఛేంజ్ ఆఫ్ గ్రూప్ (రూ.1000 , సెకండ్ ఇయర్ కోసం).
ఈ మేరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ వి.రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత కాలేజీల ప్రిన్సిపాల్స్ అందరూ ఈ నిబంధనలను పాటించాలని, విద్యార్థుల తల్లిదండ్రుల విషయంలో ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని స్పష్టం చేశారు.