Read also:
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) ఆధ్వర్యంలో అక్టోబరు 1న నిర్వహించిన ఏపీ లాసెట్-2020 ఫలితాలను గురువారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12281 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మొదటిసారి ఇచ్చిన ‘కీ’ లో తప్పులుండటంతో మరోసారి ప్రాథమిక ‘కీ’ ని విడుదల చేశారు. దీంతో ఫలితాల విడుదలకు ఆలస్యమైంది. ఎస్కేయూలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు రెక్టార్ కృష్ణానాయక్, కన్వీనరు విజయకుమార్ తెలిపారు.