Read also:
ఇపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్ : దీపావళికి జమ కానున్న వడ్డీ ఎంతంటే
2019-20 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపీఎఫ్ఓ) తన చందాదారులకు చెల్లించే మొదటి విడత 8.5% వడ్డీ దీపావళికి జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తెలిపినట్లు హిందుస్తాన్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.
హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. సెప్టెంబరులో ఈపీఎఫ్ ఓ సెంట్రల్ బోర్డు 2019-20 సంవత్సరానికి రెండు వాయిదాలలో వడ్డీని చెల్లించాలని నిర్ణయించింది. రెండవ విడత 0.35% వడ్డీతో డిసెంబర్ నాటికి చందాదారులకు జమ అవుతుంది.
ఎస్ఎంఎస్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు
- ఈపీఎఫ్ చందాదారులు తమ UAN నంబర్ EPFO అకౌంట్ లో యాడ్ చేస్తే ఎస్ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసుకోవచ్చు.
- వివరాలు పొందడానికి 7738299899 నంబర్ కు 'ఈపీఎఫ్ ఓ' అని పంపాల్సి ఉంటుంది.
- చందాదారులు తమ వివరాలను హిందీలో పంపించాలనుకుంటే వారు 'EPFOHO UAN' వ్రాసి అదే నంబర్కు పంపాల్సి ఉంటుంది.
- ఇంగ్లీష్, పంజాబీ, మరాఠీ, హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ భాషలలో ఈపీీఎ అకౌంట్ల వివరాల్ని తెలుసుకోవచ్చు.
- చందాదారుల యుఎన్ నంబర్ మరియు బ్యాంక్ ఖాతాను వారి శాశ్వత ఖాతా నంబర్ (పాన్) మరియు ఆధార్ కార్డుతో అనుసంధానించాలి.
- చందాదారులు తమ పాస్బుక్ను EPFO వెబ్సైట్ ద్వారా యాక్సెస్ చేసిన తర్వాత వారి అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. వారి పాస్ బుక్ లను యాక్సెస్ చేయడానికి వారు UAN నంబర్ తప్పని సరిగా ఉండాలి.
- చందాదారులు వెబ్సైట్ లోకి (epfindia.gov.in) లాగిన్ అయి ఇ-పాస్బుక్ ఎంపికపై క్లిక్ చేయవచ్చు.
- వినియోగదారు పేరు, పాస్వర్డ్ మరియు క్యాప్చా కోడ్ ను నింపిన తర్వాత వారు బ్యాలెన్స్ చూడాలనుకునే సభ్యుల ఐడిని ఎంచుకోవచ్చు. ఈపీఎఫ్ పాస్ బుక్ లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే దాన్ని భవిష్యత్తులో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.