Read also:
100 rupees coin released by Modi
- విజయ రాజె సింధియా పేరిట కాయిన్
- రాజమాత శతజయంతి వేళ ప్రధాని నివాళి
బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ‘రాజమాత’ విజయ రాజె సింధియా శత జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రూ.100 నాణేన్ని విడుదల చేశారు. ఈ నాణేనికి ఒకవైపు విజయ రాజె బొమ్మ ఉంటుంది. అలాగే, ఆమె శత జయంతి అని హిందీ, ఇంగ్లిషు భాషల్లో ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం వంటి విజయ రాజె సింధియా కలలు నెరవేరాయని ఆయన అన్నారు. ఆమె జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. తన జీవితాన్ని విజయ రాజె పేద ప్రజల కోసం అంకితం చేశారన్నారు. ప్రజాప్రతినిధులకు అధికారం కన్నా ప్రజల సంక్షేమమే ముఖ్యమన్న విషయాన్ని ఆమె చాటి చెప్పారని వ్యాఖ్యానించారు. తాము ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చట్టాన్ని రూపొందించి, మహిళా సాధికారతపై విజయరాజె ఆశయాలను ముందుకు తీసుకెళ్లామని తెలిపారు.