Tuesday, October 13, 2020

Cases decreased in ap



Read also:

ఆంధ్రప్రదేవ్ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 61,112 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,224 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

  1. ఆంధ్రప్రదేశ్‌లో  కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 3,224 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 61,112 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,224 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
  2. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,58,951కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య,ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
  3. కరోనా వల్ల రాష్ట్రంలో తాజాగా 32 మంది మృతి చెందారు. వీరిలో.. క‌ృష్ణాలో 5గురు, ప్రకాశంలో 5గురు, గుంటూరులో 4గురు, కడపలో 4గురు, అనంతపూర్‌లో 3గురు, తూర్పు గోదావరిలో 3గురు, చిత్తూరులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, కర్నూల్‌, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఒక్కరి చొప్పున ఉన్నారు. ఇక, రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,256గా ఉంది.
  4. ప్రస్తుతం రాష్ట్రంలో 43,983 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో.. అనంతపురంలో 209, చిత్తూరులో 293, తూర్పు గోదావరిలో 547, గుంటూరులో 379, కడపలో 190, కృష్ణాలో 86, కర్నూలులో 136, నెల్లూరులో 166, ప్రకాశంలో 270, శ్రీకాకుళంలో 133, విశాఖపట్నంలో 135, విజయనగరంలో 191, పశ్చిమ గోదావరిలో 489 ఉన్నాయి.
  5. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 5,504 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,08,712కి చేరింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :