1 నుంచి ఈ-డ్రైవింగ్ లైసెన్స్ చూపితే చాలు
మోటారు వా హన చట్టంలో సవరణల మేరకు కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 1 నుంచి వాహన పత్రా ల పోర్టల్ సేవలను ప్రారంభించనుంది. దేశవ్యాప్తంగా వాహనదారులు ఈ పోర్టల్లో రి జిస్టర్ అయ్యి.తమ వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను అప్లోడ్ చేసుకోవచ్చు.ఒక్కసారి ఆయా వివరాలను ఉన్నతాధికారులు ఆమోదిస్తే.ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎక్కడ తనిఖీలు జరిపినా, పోర్టల్/యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న ఈ-డాక్యుమెంట్లు చూ పి స్తే సరిపోతుంది. తనిఖీలు చేసి న ప్రతీసారి వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. దాని వల్ల భవిష్యత్లో తనిఖీలు చేసే అధికారుల నుంచి వేధింపులు ఉండవని కేంద్ర రహదారుల శాఖ చెబుతోంది.
డాక్యుమెంట్లతోపాటు.ఈ-చలానాలు, లైసెన్సు రద్దు వంటి పనిష్మెంట్ల వివరాలు కూడా అప్డేట్ అవుతాయి. కాగా.ఈ తరహాలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 'ఆర్టీయే ఎం-వ్యాలెట్' పేరుతో ఓ ప్రత్యేక పోర్టల్ను, మొబైల్ యాప్ను అమలు చేస్తోంది.