Read also:
30% syllabus reduced on Inter courses-ఇంటర్లో 30 శాతం పాఠ్యాంశాలు తగ్గింపు
- ఇంటర్మీడియట్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, ఆరోగ్య రంగం, విద్య, పర్యాటకం పాఠాలను తొలగించారు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం పని దినాలు తగ్గిపోవడంతో ఇందుకు అనుగుణంగా 30 శాతం పాఠ్యాంశాలను తగ్గించారు.
- ఇందులో భాగంగా రెండో ఏడాది ఆర్థికశాస్త్రంలో ఏపీ గురించి ఉన్న కొన్ని అంశాలను తీసివేశారు. వ్యవసాయ, పరిశ్రమల రంగాల పాఠాలను తీసివేశారు. మొదటి ఏడాదిలో ఆర్థిక శాస్త్ర పరిచయంను తప్పించారు. రెండో
- ఏడాది రాజనీతి శాస్త్రంలోని రాష్ట్ర శాసన,న్యాయ వ్యవస్థ, భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, భారతదేశం, ఏపీలో ఇటీవల అభివృద్ధి పాఠ్యాంశాల్లో కొన్ని అంశాలను తొలగించారు.
- మొదటి ఏడాది చరిత్రలో ఆశ్రమ, కుల వ్యవస్థ, గ్రామీణ జీవనం, ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యత్యాసం పాఠ్యాంశాలను తప్పించారు.
- రెండో ఏడాది చరిత్రలో ఫ్రెంచ్,పారిశ్రామిక విప్లవం పాఠాలను తొలగించారు.
- భౌతికశాస్త్రంలో ఎలక్ట్రిసిటీ, మూవింగ్ ఛార్జ్స్, మెగ్నెట్సిమ్, రసాయన శాస్త్రంలో ప్రతి జీవితంలో రసాయనశాస్త్రం పూర్తి అధ్యయం తీసివేశారు.
- జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) సూచనలకు అనుగుణంగా పాఠాలను తొలగించారు.