Read also:
అక్టోబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు-మంత్రి
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే 9,10 ఇంటర్ విద్యార్ధులకు పాక్షికంగా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.
అక్టోబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఉన్నత విద్యా తరగతులు మాత్రం నవంబర్ ఫస్ట్ నుంచి ప్రారంభించేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
50 శాతం మంది ఉపాధ్యాయులనే హాజరు కావాలని చెప్పామన్నారు.
లెక్చరర్స్ జీతాల విషయంపై ముఖ్యమంత్రి జగన్ తీసుకునే నిర్ణయాల మేరకు నడుచుకుంటామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.