Read also:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డులతో కొనేవారికి 10% అదనంగా తగ్గింపు లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి.
ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి శుభవార్త. మీరు కొత్త స్మార్ట్ఫోన్ లేదా టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఓ వారం రోజులు ఆగండి. రిపబ్లిక్ డే సందర్భంగా 'అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్' ప్రారంభం కాబోతోంది. ఈ ఏడాది అమెజాన్ నిర్వహించబోతున్న మొదటి గ్రేట్ ఇండియన్ సేల్ ఇదే. జనవరి 19 నుంచి 22 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ జరగనుంది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఒకరోజు ముందే సేల్ ప్రారంభం అవుతుంది. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వేర్, ఫర్నీచర్ ఇలా అన్ని కేటగిరీల్లో ఆఫర్లను ప్రకటించింది అమెజాన్. షావోమీ, రియల్మీ, ఒప్పో, సాంసంగ్, వివో స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్స్ ఉంటాయి. అంతే కాదు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డులతో కొనేవారికి 10% అదనంగా తగ్గింపు లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో ఐఫోన్ ఎక్స్ఆర్, రెడ్మీ నోట్ 8 ప్రో స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్తో పాటు వన్ప్లస్ ఫోన్లపైనా డిస్కౌంట్ ఉంటుంది. వన్ప్లస్ 7టీ రూ.34,999 ధరకే లభించనుంది. ప్రస్తుతం రెడ్మీ నోట్ 8 ప్రో ధర రూ.15,999. ఈ ఫోన్ ధర తగ్గించనుంది అమెజాన్. సాంసంగ్ ఎం30ఎస్, వివో యూ20 ధరల్ని కూడా తగ్గించనుంది. అయితే ఈ సేల్లో ఏ స్మార్ట్ఫోన్పై ఎంత ధర తగ్గుతుందో ఇంకా వెల్లడించలేదు అమెజాన్. రియల్మీ, నోకియా, హానర్, ఒప్పో లాంటి కంపెనీలు సేల్ కంటే ముందే ఆఫర్లను ప్రకటిస్తాయి.