Read also:
అమెరికాలోని పాఠశాలల్లో గణితం, సైన్స్ సబ్జెక్టులు బోధించేందుకు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నాన్రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) అధ్యక్షుడు మేడపాటి వెంకట్ తెలిపారు. 50 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అక్లెమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండియా ఆధ్వర్యంలో టెక్సాస్లోని పలు పాఠశాలల్లో బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు మూడేళ్ల గడువు కలిగిన జే1 వీసా పొందుతారని, మరో రెండేళ్లు పొడిగించేందుకు అవకాశం ఉందని వివరించారు. బీఈడీ/ఎంఈడీ చదివి, ఐదేళ్లకు పైగా బోధన అనుభవం ఉండాలన్నారు. వీసా పొందేందుకు టోఫెల్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలన్నారు. అర్హత కలిగినవారు
వెబ్సైట్లో జనవరి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.