Read also:
హైదరాబాద్ : నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 24న జాబ్మేళాను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పనాధికారి లక్ష్మణ్కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం 10:30 గంటల నుంచి విజయనగర్కాలనీలోని మల్లేపల్లి బాలుర ఐటీఐ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ జాబ్మేళా జరుగుతుందన్నారు. కోటక్ బ్యాంక్, ఒప్పొ మొబైల్స్, హైదరాబాద్ సెంట్రల్, క్వెస్కార్పో ప్రైవేట్ లిమిటెడ్, శుభగృహ ప్రాజెక్ట్, పేరం గ్రూపు, కాలిబ్ హెచ్ఆర్, రబ్బ యుటిలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహా మరికొన్ని కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీచేస్తామన్నారు. వివరాలకు 82476 56356 నెంబర్లను సంప్రదించాలన్నారు.
టెన్త్, ఇంటర్మీడియట్ అర్హతతోనే రూ.20 వేల వేతనంతో ఉద్యోగం...24న జాబ్ మేళా
హైదరాబాద్లో ఈనెల 24న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి అధికారి లక్ష్మణ్కుమార్ తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఈమేళాలో కోటక్ బ్యాంకు, ఒప్పో మొబైల్స్, క్యూస్ క్రాప్, ఎల్పిఎఫ్ సిస్టిమ్స్, ఐడిబిఐ, కార్వీ ఫోర్డ్, శుభగ్రుహ ప్రాజెక్టు, పేరం గ్రూపు వంటి 12 కంపెనీలు పాల్గొన్నట్లు చెప్పారు. ఈకంపెనీలో పనిచేయుటకు 800 ఉద్యోగాల ఎంపికకు జాబ్మేళా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్ధులు పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, బికాం, ఏదైనా డిగ్రీ చదివి ఉండాలని, వారిని ఫీల్డ్ సేల్స్, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్, ఫాషన్ కన్సల్టెంట్, పైనాన్సియల్ అడ్వైజర్, కస్టమర్ సపోర్ట్, మార్కెటింగ్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్, టెలికాలర్స్, కస్టమర్ సర్వీసు రిప్రజేంటివ్, సేల్స్ ట్రైనీస్, ప్రమోటర్స్, ఫీల్డ్ నెట్వర్క్, ఇంజనీర్స్ ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు ఎంపికైన వారికి నెలకు రూ. 10వేల నుండి, రూ.20వేలు వరకు ఇవ్వబడుతున్నట్లు, వయస్సు 19-35 సంవత్సరాల అర్హులన్నారు. అర్హత ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ,యువకులు తమ బయోడేటాతో పాటు జిరాక్స్ సర్టిఫికేట్లతో మంగళవారం మల్లేపల్లి బాలుర ఐటిఐ క్యాంపస్ వద్ద నున్న ఉపాధి కార్యాలయం, మాడల్ కెరియర్ సెంటర్లో ఉదయం 10.30 గంటలకు జరుగు మేళాకు హాజరు కావల్సిందిగా కోరారు.