Read also:
అమ్మఒడి పథకంపై పాఠశాల విద్యాశాఖ 26,27 తేదిల్లో గ్రామ సభల అనుమతి
అమ్మఒడి పథకంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జగనన్న అమ్మఒడి పథకం కింద ఒకటి నుంచి ఇంటర్మీడి యేట్ చదువుతున్న విద్యార్థులకు రూ.15వేలు ఆర్థిక సహాయాన్ని రాష్ట్రప్రభుత్వం అందజేయనున్న విషయం తెలిసిందే. విద్యార్థులు, వారి తల్లుల సమాచారం సేకరించిన విద్యాశాఖ క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తిచేసి వెబ్సైట్లో పొందుపరిచింది. పాఠశాల విద్య, ఇంటర్మీడియేట్ విద్య పొందుపరిచిన సమాచారాన్ని ఎపిసిఎఫ్ఎస్ఎస్ పరిశీలన చేస్తోంది. ఈ నెల 24న ఇద్దరు అంతకు మించి పిల్లలు ఉన్న తల్లులను గుర్తించే ప్రక్రియను ఎపిసిఎఫ్ఎస్ఎస్ పూర్తిచేయాలి. గుర్తించిన సమాచారాన్ని ఈ నెల 26,27 తేదీల్లో గ్రామ, వార్డు సభ ఆమోదం కోసం విద్యాశాఖ పంపుతుంది.