Read also:
రాష్ట్ర విద్యార్థి తేజస్వికి కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ ప్రశంసలు
ఫిట్ ఇండియా పాఠశాల వారోత్సవాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో నిలిచినట్లు కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా 26,845 పాఠశాలల్లో ఈ వారోత్సవాలు నిర్వహించగా అందులో 13,839 ఆంధ్రప్రదేశ్వేనని తెలిపింది. ‘ఫిట్ఇండియా’పై నిర్వహించిన పోటీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సాయిబాబా సెంట్రల్ స్కూల్ విద్యార్థి ఆర్.తేజస్వి అందరినీ మంత్రముగ్ధులను చేసినట్లు కేంద్ర క్రీడాశాఖ పేర్కొంది.