Read also:
ఏపీ హైకోర్టు ఆగ్రహం-ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులొద్దు
అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ప్రశ్నించింది. 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైకాపా రంగులు వేయడంపై పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయవద్దని ఆదేశించింది.