Read also:
రేపు భేటీ కానున్న ఏపీ కేబినెట్
బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం భేటీ కానుంది. ఈ భేటీలో 30 కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. అయితే రేపటి బేటీలో అమ్మ ఒడి, రైతు భరోసా, భూకేటాయింపులు, ఉద్యోగాల భర్తీ, ఇసుక కొరత వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. కాగా, వచ్చేనెల నుంచి ప్రతి రెండు, నాలుగు బుధవారాల్లో కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.