Tuesday, September 3, 2019

పన్ను చెల్లింపులకు ఇకనుంచి ఆధార్​ కార్డు కీలకం



Read also:

పన్ను చెల్లింపులకు ఇకనుంచి ఆధార్​ కార్డు కీలకం

పన్ను చెల్లింపులకు ఇకనుంచి ఆధార్​ కార్డు కీలకం కానుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నూతన నిబంధనల ప్రకారం ఆధార్​తో ఐటీ రిటర్ను దాఖలు చేసిన వారికి సుమోటోగా పాన్​ దరఖాస్తు స్వీకరిస్తారు.

పన్ను చెల్లింపుల సమయంలో ఇక నుంచి ఆధార్​ కార్డు వివరాలను పొందుపరిస్తే సరిపోతుంది. ఆధార్​ కార్డుతో అనుసంధానమైన పాన్​ కార్డు వివరాలను ఆదాయపు పన్ను శాఖ తనంతట తానే సేకరిస్తుంది. ఈ విధానం సెప్టెంబర్​ 1 నుంచి అమలవుతున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు (సీబీడీటీ) తెలిపింది.

ఐటీ చట్టంలోని 139 ఏఏ(2) ప్రకారం 2017 జులై 1 లోపు పాన్​ కార్డు ఉన్న వ్యక్తి ఆధార్​ పొందేందుకు అర్హుడు. ఆధార్​ వచ్చాక ఆ వివరాలను ఐటీ శాఖతో పంచుకోవాలి. ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు ఆధార్​ కార్డు అనుసంధానం రాజ్యాంగబద్ధంగా అంగీకారమేనని, అందుకు బయోమెట్రిక్​ ఐడీ తప్పనిసరని గతేడాది సెప్టెంబర్​లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు కొత్త విధానాన్ని ప్రకటించింది సీబీడీటీ.

"ఎవరైనా పాన్​ కార్డు లేకుండా కేవలం ఆధార్​ కార్డుతోనే ఐటీ రిటర్న్ దాఖలు చేస్తే.. వారికి సుమోటోగా పాన్​ కార్డు దరఖాస్తు వచ్చేస్తుంది. అంటే వాళ్లకు ఆధార్​ ఉంటే మేం పాన్​ కార్డు ఇస్తాం. పాన్​, ఆధార్​ అనుసంధానం తప్పనిసరి."

-పీసీ మోదీ, సీబీడీటీ ఛైర్మన్​

పాన్​, ఆధార్​ పొందేందుకు పౌరులు సమర్పించాల్సిన వివరాలు ఒకటే కావటం వల్ల ఈ రెండింటికీ సమ ప్రాధాన్యం ఉంటుందని బడ్జెట్​ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​ ప్రకటించారు. ఒకదాని స్థానంలో మరొకటి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చని స్పష్టంచేశారు. ఆధార్​, పాన్​ అనుసంధానం చేసుకోవాలని ఇప్పటికే ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్​ 30తో ఆ గడువు పూర్తి కానుంది. 120 కోట్ల మందికి ఆధార్​ కార్డులు ఉండగా... 41 కోట్ల మందికి పాన్​ కార్డులు ఉన్నాయి. ఇందులో అనుసంధానమైనవి 22 కోట్లు మాత్రమేనని సీబీడీటీ వెల్లడించింది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :