ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది.
ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాల చెల్లించే హెడ్ ఆఫ్ అకౌంట్లను మార్పు చేయడం వల్ల వాటిని మ్యాపింగ్ చేయటంలోనూ చాలా ఆలస్యం కావడం వల్ల ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క జీతం బిల్లు కూడా సబ్మిట్ కాలేదు సాధారణంగా ఉద్యోగుల జీత భత్యాలు ప్రతి నెల 25వ తేదీ లోపు సబ్మిట్ చేయవలెను కానీ నేటికీ ఒక్క బిల్లు కూడా సబ్మిట్ కాలేదు ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం డి టి ఓ ఆఫీస్ నందు హెడ్ ఆఫ్ అకౌంట్స్ మ్యాపింగ్ జరుగుచున్నది తదుపరి డి డి ఓ రిక్వెస్ట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నది అది కాక సాధారణ సెలవులు కూడా వరుసగా రావడం వల్ల కూడా జీతం బిల్లు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నది సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం రెండవ తేదీ వినాయక చవితి సాధారణం సెలవులు కావడంవల్ల జీతాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నది.