Sunday, August 25, 2019

రెడ్ మి ఫోన్లు ఇక వేడెక్కవు



Read also:

Tech News
రెడ్ మి ఫోన్లు ఇక వేడెక్కవు . . సరికొత్త ఫీచర్ తో
హైదరాబాద్ : చైనీస్ మొబైల్ మేకర్ షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి త్వరలో రాబోతున్న ' నోట్ 8 ప్రో ' లో లిక్విడ్ కూలింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది . 
ఫలితంగా ఫోన్ 4 నుంచి 6 డిగ్రీలు చల్లగా ఉండనుంది . ఎక్కువ సేపు వాడినప్పుడు కూడా ఫోన్ వేడెక్కకుండా ఈ ఫీచర్ అడ్డుకుంటుందని ' జీఎస్ఎంఎరీనా ' పేర్కొంది . నోట్ 8 ప్రొలో సరికొత్త హీలియో జి9ంటి చిప్ సెట్ ను ఉపయోగించినట్టు చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో తెలిపింది . అలాగే , ఈ ఫోన్లో వెనక నిలువుగా మూడు కెమెరాలు , కుడివైపున నాలుగో కెమెరా ఉన్నట్టు వీబో పేర్కొంది . దీంతోపాటు వెనక ఫింగర్ ప్రింట్ స్కానర్ , గ్లాస్ - శాండ్ విచ్ డిజైన్ ఉన్నట్టు తెలుస్తోంది . ఈ నెల 29న చైనాలో నోట్ 8 , నోట్ 8ప్రొ , రెడీమి టీవిలను రెడీమి విడుదల చేయబోతోంది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :