Friday, April 9, 2021

ఏపీ లో మరోచోట లాక్ డౌన్



Read also:

కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు స్వచ్చందంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రామాల్లో లాక్‌డౌన్‌ విధిస్తూ ఆయా గ్రామాల పంచాయతీలు తీర్మానం చేశాయి. మరికొన్నిచోట్ల అధికారులు లాక్‌డౌన్ విధిస్తున్నారు.

తాజాగా గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో వారంపాటు లాక్‌డౌన్ విధిస్తూ ఎమ్మార్వో నాంచారయ్య నిర్ణయం తీసుకున్నారు.
రేపటి నుంచి ఈ నెల 16 వరకు కొల్లిపర మండలంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవాలని, హోటళ్లు, టీ స్టాల్స్ పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. గతంలో గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు మండలంలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :