Read also:
మాచవరం ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళా శాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాంతీయ అధ్యయన కేంద్రంలో చదువుతున్న పాత డిగ్రీ విద్యార్థులకు వచ్చే నెల 15వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధ్యయన కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎం.అ జంతకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని, 300 రూపాయల అపరాధ రుసుంతో 30వ తేదీ వరకు ఏపీ ఆన్లైన్లో చెల్లించవచ్చన్నారు. తృతీయ సంవత్సరం విద్యార్థులకు వచ్చేనెల 15వ తేదీ నుంచి 20 వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వచ్చే నెల 22 నుంచి 27వ తేదీ వరకు, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వచ్చే నెల 28 నుంచి మే ఒకటో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయ న్నారు. మరింత సమాచారం కోసం కళాశాల ప్రాంగణంలోని వర్సిటీ అధ్యయన కేంద్రంలో స్వయంగా కానీ వర్సిటీ వెబ్ సైట్ లో కానీ సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.