Read also:
అమరావతి: మున్సిపల్ ఎన్నికలకు తాజా నోటిఫికేషన్ విడుదల చేయాలన్న పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గతంలో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 11నెలలు గడిచినందున తాజాగా నోటిషికేషన్ వేయాలని పిటిషనర్ల న్యాయవాదులు కోర్టును కోరారు. విచారించిన హైకోర్టు ధర్మాసనం.. వారి అభ్యర్థనను తిరస్కరించి, పిటిషన్లను కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్లో మార్చి 10న పురపాలక ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఎస్ఈసీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కణ్నుంచే కొనసాగించేలా ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది.