Read also:
ఏపీలో కొత్తగా 87 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 30,527 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,88,692కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో ఎటువంటి మరణం సంభవించలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్తో మరణించిన వారి సంఖ్య 7,161గా ఉంది. ఒక్కరోజు వ్యవధిలో 79 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 853 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,34,53,405 నమూనాలను పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.