Read also:
రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం, కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు గడువును ఈనెల 18వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ జిల్లాల్లో అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 18 వరకు ఓటర్లుగా నమోదుకు, అభ్యంతరాలకు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. అభ్యంతరాలను, దరఖాస్తులను పరిష్కరించిన తరువాత వచ్చేనెల 5వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదుకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఆయా సంస్థలు సర్వీసు సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. తప్పుడు సర్టిఫికెట్లు జారీచేసినా, వాటితో దరఖాస్తు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.