Read also:
ఉపాధ్యాయుల బదిలీల్లో పాఠశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదు గడువు గురువారంతో ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం వరకు 3,448మంది వెబ్ ఐచ్ఛికాలను ఫ్రీజ్ చేయకుండా వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. మరో 1,763మందికి చెందిన ఐచ్ఛికాల మార్పు వివరాలు మండల విద్యాధికారుల వద్దే నిలిచిపోయాయి. అమ్మఒడి పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నందున ఉపాధ్యాయులకు స్థానాల కేటాయింపు కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.