Read also:
ఏపీలో స్కూళ్ల ప్రారంభం-ఏ రోజు ఏయే తరగతులు-సీఎం జగన్ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ తెరవడంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. ఏ రోజు ఏయే తరగతులు ప్రారంభిస్తామనే దానిపై వివరణ ఇచ్చింది.
- కరోనా సంక్షోభం తరువాత స్కూల్స్ ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. నవంబర్ 2 నుంచి స్కూల్స్ ప్రారంభమిస్తామని ప్రకటించింది-తాజాగా దీనిపై ఏపీ ప్రభుత్వం మరింత వివరణ ఇచ్చింది.
- నవంబర్ 2 నుంచి ప్రారంభం కాబోయే స్కూల్స్లో 1,3,5,7 తరగతులకు సంబంధించిన విద్యార్థులకు ఒక రోజు.2,4,6,8 తరగతులు మరో రోజు తరగతులు నిర్వహిస్తామని సీఎం జగన్ తెలిపారు.
- విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులు తరగతులు నిర్వహిస్తామని అన్నారు.
- నవంబర్లో మధ్యాహ్నం వరకు ఒంటి పూట స్కూళ్లు పనిచేస్తాయని వెల్లడించారు. పరిస్థితిని బట్టి డిసెంబర్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ అన్నారు.
- విద్యార్థులను తల్లిదండ్రులు స్కూళ్లకు పంపకపోతే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామని అన్నారు.