Read also:
Clarity on doubts in teacher promotions
- పదోన్నతుల ప్రక్రియలో ఉపాధ్యాయుల సందేహాలపై పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు స్పష్టత నిచ్చారు.
- ఈ మేరకు విశాఖపట్నం డీఈఓకు ఉత్తర్వులు జారీ చేసారు.
- భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
- 150లోపు రోలు ఉన్న పీ ఎస్ హెచ్ ఎం పోస్టులకు పదోన్నతులిచ్చి ఎస్జీటీగానే పరిగణిస్తామన్నారు.
- భాషా పండితుల జీతాలు తీసుకునే ఎస్జీటీ పోస్టులను ఖాళీలు గానే చూపుతారని జీవో 53 ప్రకారం సర్దుబాటు చేస్తామన్నారు.
- భాషా పండితులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వారు ఎస్జిటి పోస్టుల నుండి జీతాలు తీసుకుంటున్నందున బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవలసిన స్థలం, పోస్టు విషయమై మెమో 13209 లో పేర్కొన్న మేరకు నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు.
- డీఈఓ పూల్లోని స్కూల్ అసిస్టెంట్ల బదిలీ కోసం దరఖాస్తు చేసుకొనే విషయయంలోనూ ఇదే మెమోలో వివరణ ఉందని సూచించారు.