Tuesday, October 20, 2020

Clarity on doubts in teacher promotions



Read also:

Clarity on doubts in teacher promotions

  • పదోన్నతుల ప్రక్రియలో ఉపాధ్యాయుల సందేహాలపై పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు స్పష్టత నిచ్చారు. 
  • ఈ మేరకు విశాఖపట్నం డీఈఓకు ఉత్తర్వులు జారీ చేసారు.
  • భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 
  • 150లోపు రోలు ఉన్న పీ ఎస్ హెచ్ ఎం పోస్టులకు పదోన్నతులిచ్చి ఎస్జీటీగానే పరిగణిస్తామన్నారు. 
  • భాషా పండితుల జీతాలు తీసుకునే ఎస్జీటీ పోస్టులను ఖాళీలు గానే చూపుతారని జీవో 53 ప్రకారం సర్దుబాటు చేస్తామన్నారు.
  • భాషా పండితులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వారు ఎస్‌జిటి పోస్టుల నుండి జీతాలు తీసుకుంటున్నందున బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవలసిన స్థలం, పోస్టు విషయమై మెమో 13209 లో పేర్కొన్న మేరకు నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. 
  • డీఈఓ పూల్‌లోని స్కూల్ అసిస్టెంట్ల బదిలీ కోసం దరఖాస్తు చేసుకొనే విషయయంలోనూ ఇదే మెమోలో వివరణ ఉందని సూచించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :