Read also:
Lockdown Extend to till may3 -Modi Speech
కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం తొలుత ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ గడువు ఇవాల్టితో పూర్తవుతుంది. ఈ లాక్ డౌన్ను లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే
- కరోనావైరస్ మహమ్మారిపై భారత్ పోరాటం బలంగా కొనసాగుతోంది.
- మీరు కష్టాలకు ఓర్చుకుని, దేశాన్ని కాపాడారు.
- మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు.
- ఓ సైనికుడిలా మీరు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు
- మన రాజ్యాంగంలో 'వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా' అన్నదానికి అర్థం ఇదే. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున మన సామూహిక శక్తిని చాటుకుంటూ ఆయనకు నివాళి అర్పిస్తున్నాం.
- లాక్డౌన్లో నియమనిబంధనలను పాటిస్తూ పండుగలను జరుపుకోవడం స్ఫూర్తిదాయకం.
- కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త సంవత్సరం పండుగ జరుపుకుంటున్నారు. వారికి నా శుభాకాంక్షలు.
- మిగతా దేశాలతో పోల్చితే భారత్ కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేసిన కృషిలో మీరు భాగస్వాములు, దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా.
- కరోనావైరస్ రోగుల సంఖ్య వందకు చేరుకోకముందు విదేశాల నుంచి వచ్చినవారికి 14 రోజుల ఐసోలేషన్ను భారత్ తప్పనిసరి చేసింది.
- 550 కేసులున్నప్పుడు 21 రోజుల లాక్డౌన్ రూపంలో చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాం.
- సమస్య తలెత్తగానే, త్వరగా నిర్ణయం తీసుకుని దాన్ని అరికట్టే ప్రయత్నం చేశాం.
- ఈ సమస్య విషయంలో ఏ దేశంతోనూ మనం పోల్చుకోవడం సరికాదు. కానీ, ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో పోల్చుకుని చూసుకుంటే, భారత్ ఇప్పుడు చాా మెరుగైన స్థితిలో ఉంది.
- నెలన్నర కిందట కరోనావైరస్ వ్యాప్తి విషయంలో చాలా దేశాలు భారత్తో సమానంగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆ దేశాల్లో మన కన్నా 25 రెట్లు ఎక్కువగా కేసులు పెరిగాయి
- భారత్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో మనం ఊహించలేం.
- కొన్ని రోజులుగా జరుగుతున్నది చూస్తే, మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని అర్థం అవుతుంది.
- సామాజిక దూరం పాటించడం, లౌక్డౌన్ వల్ల దేశానికి చాలా లాభం జరిగింది.
- ఆర్థికపరంగా చూసుకుంటే దీని వల్ల మనకు బాగా నష్టం జరిగిందనిపించవచ్చు. కానీ, దేశ పౌరుల ప్రాణాల కన్నా ఏదీ ఎక్కువ కాదు.
- మనం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా, కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు ప్రపంచవ్యాప్తంగా నిపుణులను, ప్రభుత్వాలను భయపెడుతోంది.
- కరోనావైరస్పై పోరాటం మనం ఎలా కొనసాగించాలి? నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి? ప్రజల ఇబ్బందులను ఎలా తక్కువ చేసుకోవాలి? ఈ విషయాలన్నింటిపై రాష్ట్రాలతో చర్చించాం.
- లాక్డౌన్ పొడిగించాలని చాలా రాష్ట్రాలు కోరాయి. కొన్ని అమలు చేశాయి కూడా.
- భారత్లో లాక్డౌన్ను మే 3 వరకూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం.కొంత ప్రాంతాల్లో మనం ఇక కరోనావైరస్ వ్యాపించనీయకూడదు.
- మనం ముందుకున్నా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి.
- హాట్స్పాట్లుగా మారే అవకాశమున్న ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టాలి. కొత్త హాట్స్పాట్లతో మనకు మరిన్ని ఇబ్బందులు వస్తాయి.
- ఏప్రిల్ 20 వరకూ అన్ని చోట్లా కఠినంగా లాక్డౌన్ అమలు చేసుకోవాలి.