Read also:
శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలను ప్రోక్షణ చేసిన తరవాత దీపారాధన అలంకరణం చేసి నైవేద్య నివేదన కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి తమకున్న సమస్త గ్రహాదోష నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి , ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు, ఎక్కడ చేయకూడదు. ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి.ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి . ఇంట్లో పూజ పూర్తీ అయిన తర్వాత గుడికి దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును.మొదట ఇంట్లో పూజ చేయనిది దేవాలయాలకు ఎప్పుడూ వెళ్ళకూడదు. ఆ రోజు శక్తి కొలది ఆవునకు ఉలవలు ,బెల్లం , అరటి పండ్లు విస్తరి ఆకులో కాని అరటి ఆకులో కాని పెట్టి ఆవుకు తినిపించి మూడు ప్రదక్షిణలు చేస్తే మంచిది.
గ్రహణం తర్వాత దానాదులను చేయడం వల్ల చెడు ఫలితాలను తగ్గించుకోవచ్చు. గ్రహణ వల్ల చెడుప్రభావం ఉండి దానాలు చేయలేని వారు భయపడాల్సిన పనిలేదు. వారు తమ శక్తి మేరకు భగవంతుడిని ప్రార్ధన, ఆరాధన, ధ్యానం చేసుకుని శాంతితో సహనంతో కాలం గడిపితే మంచిది. చెడు సమయం అంటూ నిజానికి ఏది ఉండదు. చెడు ఫలితాల వల్ల జీవితానికి కావల్సిన
అనుభవం, అన్నింటిని తట్టుకునే శక్తి వస్తుంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు గ్రహణ స్నానం, పట్టువిడుపు స్నానాలను చేయడం, ధాన్యం, జపం, దానం, దేవాలయ సందర్శనం, ప్రదక్షణలు, దీపారాధన మంచి ఫలితాన్నిస్తాయి.
Live Videos server 1
Live video Server 2
Live Videos server 1