Saturday, November 9, 2019

No charges on intermediate transactions neft



Read also:

No charges on intermediate transactions-Neft

  • బ్యాంకు కస్టమర్లకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. సేవింగ్ అకౌంట్ ఉన్న వారి నుంచి నెఫ్ట్ చార్జీలను వసూలు చేయకూడదని బ్యాంకులను ఆదేశించింది.
  • అయితే ఈ నిర్ణయం జనవరి 2020 నుండి అమల్లోకి రానుంది.
  • కాగా రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా గతంలోనే నెఫ్ట్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ ట్రాన్సాక్షన్లపై చార్జీలు తొలగిస్తామని ప్రకటించింది, ఇప్పుడు అది అమల్లోకి రానుంది.
  • కాగా మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా జరిపే నెఫ్ట్ లావాదేవీలకు ఇప్పటికే బ్యాంకులు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు.
  • అయితే ఇకపై బ్యాంకుకు వెళ్లి ఇతరులకు నెఫ్ట్ లో డబ్బు పంపాలన్నా ఎలాంటి చార్జీలు పడకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంది. 
  • ఈ మేరకు ఆర్బీఐ వెల్లడిస్తూ ''డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి వారు వసూలు చేసే ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ ట్రాన్సాక్షన్లపై చార్జీలను తొలగించాలని నిర్ణయించినట్టు, దీంతో బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలి అని, ఒక వారంలోగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయి'' అని ఆర్‌బీఐ తెలిపింది.
  • కాగా ఆర్‌బీఐ నెఫ్ట్ సర్వీసులు ఇక రోజంతా అందుబాటులో ఉండేలా రూపొందించాలని భావిస్తోంది. అయితే ఈ నిర్ణయం 2019 డిసెంబర్ నుంచి అమలులోకి రానుంది.
  • ఇప్పుడు నెఫ్ట్ సర్వీసులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
  • అయితే డిసెంబర్ నుండి 24 గంటలు నెఫ్ట్ సర్వీసులు అందుబాటులో ఉండేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :