Read also:
కాపులకు ఏపీ ప్రభుత్వం షాక్
కాపులకు 'స్వయంఉపాధి' రద్దు
గత ప్రభుత్వంలో మంజూరైన వాటిపై నిర్ణయం
మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచన
నిరాశలో 43వేల మంది లబ్ధిదారులు
అమరావతి(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్లోని స్వయం ఉపాధి పథకానికి ఎంపికైన లబ్ధిదారులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అప్పట్లో పథకానికి ఎంపికై రాయితీలు విడుదల కాని వారందరి పేర్లను జాబితా నుంచి తొలగించింది. అందరూ మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో 43వేల మందికి నిరాశే మిగిలింది.
ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకుంటే అందులో తాము మళ్లీ ఎంపికవుతామన్ననమ్మకమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.2018-19 ఆర్థిక సంవత్సరంలో కాపు కార్పొరేషన్ 68వేల మందికి స్వయంఉపాధి పథకంలో లబ్ధి చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
60వేల మందికి పైగా లబ్ధిదారులను ఎంపిక చేసినా, 20వేల మందికి మాత్రమే రాయితీలు విడుదల చేసింది. తాజాగా వైసీపీ ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో లబ్ధికి ఎంపికై నిధులు విడుదల కాని వారందరి పేర్లు రద్దు చేసింది. అందరూ మళ్లీ కొత్తగా దరఖాస్తు పెట్టుకోక తప్పదని స్పష్టం చేసింది. ఈనెల 31వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చింది. ఈ 43వేల మందికి ప్రస్తుత ప్రభుత్వం లబ్ధి చేకూర్చినట్లయితే సుమారు రూ.315కోట్లు రాయితీ ఇవ్వాల్సి వచ్చేది. అవి గతేడాది లెక్కలోకి వెళ్లేవి. ఇప్పుడు కొత్తగా మళ్లీ 60వేల మందికి రాయితీలు వచ్చే అవకాశం ఉండేది. కానీ ఈ ఏడాది లక్ష్యం 68వేల మందిలోనే రద్దుచేసిన 43వేల మంది రానున్నారు.